రాను రాను దేశంలో స్త్రీ లకు పూర్తి భద్రత కరువయ్యిందా అనిపిస్తుంది. ప్రతిరోజు మహిళలపై జరుగుతున్న అక్రమాలు, అత్యాచారాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వారిని శిక్షిస్తున్నా కామాందులు వారి పని వారు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. తాగిన మైకంలో కొందరు.. అశ్లీల చిత్రాల ప్రభావం చేత కొందరు చెడు మార్గంలో వెళుతూ మహిళలను మృగాళ్లలా వెంటాడుతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల బాలుడితో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు దంపతులను గుర్తుతెలియని నలుగురు సాయుధులు అడ్డగించారు. చుట్టు పక్కల ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి భర్తను కొట్టి చెట్టు కట్టేశారు. అంతే కాదు అతడి తుపాకీ పెట్టి భార్య(23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సహరాన్పూర్ నుంచి షామిలి జిల్లాకు వెళుతున్న సమయంలో దంపతులపై  సాయుధులైన దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పపడ్డారు. అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, బాధితుల వద్ద ఉన్న నగదు, ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తివారీ చెప్పారు. ఈ దుండగులు కారు లో వచ్చారని ఒంటరిగా బైక్ పై వెళుతున్న వీరిపై విరుచుకుపడ్డారని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: