తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ. ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం చేసాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సరసరన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో 1993లో సినీ పరిశ్రమలో అరంగేట్రం అప్పట్లో తెగ ఊర్రూతలూగించిన నటి రంభ.  తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన రంబ తొంభైవ దశకంలో అందాల ఆరబోతతో కుర్రకారు మనసులు దోచేసింది.


మొదటి పాపతో రంభ



 దర్శకధీరుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో 'బొంబాయి ప్రియుడు' చిత్రంలో నటించింది. 'బావగారు బాగున్నారా' చిత్రంలో చిరంజీవి సరసన తన గ్లామర్ తో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే కాక, బాలీవుడ్తో పాటు భోజ్పూరిలో కూడా నటించిన అనుభవం రంభకు ఉంది. 2010లో ఇంద్రన్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను రంభ వివాహాం చేసుకుంది. ఇప్పటికే ఓ పాపకు తల్లి అయిన రంభ తాజాగా (30.03.2015) మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గతంలో రాజమౌళి తీసిన యమదొంగ సినిమాల ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: